Home / Telangana
ఏపీలో అన్న జగన్ మోహన్రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతుంది. ప్రధానంగా నగదు పంపిణీ, లోపాయికారి హామీలు, విచ్చల విడి మద్యం పంపిణీ అంశాలు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. అధికార దాహంతో ఒకరైతే, అధికారం కోసం మరొకరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
పొలం కూలీలపై తేనిటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొనింది.
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చేశారు గుర్తు తెలియని కొందరు దుండగులు.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేర నాకా బంద్ (చెక్ పోస్టు)లో ఇప్పటివరకు రూ. 1,48,44,160 స్వాధీనం చేసుకొన్నామన్నారు.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కులవృత్తులను బలోపేతం చేస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.