Home / Telangana
MLA Quota MLC Seats In Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ బెర్తులపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం చర్చించి అభ్యర్థులపై రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే […]
Telangana Government good news to RTC Employees for DA: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. […]
Half Day Schools in Telangana from 15th March: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలలను ఒంటిపూట నడపాలని నిర్ణయించింది. ఇక, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు చిరు వ్యా పారులు […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 10,950 గ్రామస్థాయిలో ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. పది జిల్లా […]
Telangana Cabinet : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయనిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని […]
CPI Narayana : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. అగ్రరాజ్యంలో తాజా పరిస్థితిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఎలాన్ మాస్క్తో సమావేశం సందర్బంగా విధి రౌడీలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉందని ఎద్దేవా […]
Karimnagar Graduate MLC Election : ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఆరేండ్ల కింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తప్పనిసరిగా విజయం సాధించాలని పీసీసీకి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసినా ఓటమి తప్పలేదు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల వద్దకు వెళ్లి చెప్పి ఆకట్టుకోలేకపోయారు. ఓటర్లు గ్రాడ్యుయేట్లు […]
Harish Rao : కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని, కాళేశ్వరం కుంగింది అన్నవారికి, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కండ్లు తెరవాలని, లేకపోతే చరిత్ర క్షమించదన్నారు. బుధవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల […]
Teenmar Mallanna : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం ఎట్ల రాదో చూస్తానని పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్లో పాల్గొన్న బీసీవాదులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర […]
Gun Fire in America: అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచోసుకున్నాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. మృతుడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాకు కేశంపేటకు చెందిన ప్రవీణ్(27)గా గుర్తించారు. కాగా, ప్రవీణ్ ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. వివరాల ప్రకారం.. కేశంపేట మండలానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి దంపతులకు కుమారుడు ప్రవీణ్, కుమార్తె ఉన్నారు. యూఎస్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రవీణ్ హత్యకు గురయ్యారు. ప్రవీణ్ ఇటీవల ఓ స్టార్ […]