Home / Telangana
Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో సోమవారం జీఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ సర్కారు తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ సర్కారు సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి ఐదు నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. […]
PCC Chief Mahesh Kumar Goud Hot comments on Delimitation: డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభనజపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టూరిజం ప్లాజాలో ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన-దక్షిణ భారత భవిష్యత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిలిమిటేషన్పై చర్చించకుంటే […]
KCR Sentational Comments on Telangana Congress Government: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వాయిస్ మారింది. గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలల్లో లేదా ఏడాదిలో కూలిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మాత్రమే కాదు. కేటీఆర్, హరీష్రావులు సైతం అదే జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. […]
HCU Land Dispute Case postponed to 24th April 2025 by High Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. హై కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. భూ వివాదం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. కేసులో కౌంటర్, రిపోర్టు ఈ నెల 24లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యూనివర్సిటీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ […]
New Elected Telangana MLC’s Oath Taking at Telangana Legislative Council: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నూతనంగా 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి 8మందితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్రెడ్డి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి మంత్రి […]
Rain alert to Andhra Pradesh & Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీతో పాటు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని […]
KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ భూముల్లో చెట్లను ప్రభుత్వం తొలగిస్తుండగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి వెంటనే అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పలు ప్రశ్నలు సంధించి వివరణ ఇవ్వాలని సర్కారుకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అప్రమత్తమై మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై […]
CM Revanth Reddy Having Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం ఆ కుటుంబసభ్యుల కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మొదటి నుంచి రాష్ట్రంలోని లబ్ధిదారులకు 6 […]
Union Minister Bandi Sanjay’s sensational comments AIMIM : శాసన మండలి ఎన్నికల్లో దేశద్రోహ ఎంఐఎం పార్టీకి, దేశభక్తి పార్టీ బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీ ఎంఐఎంకు ఓటు వేస్తారా? లేక దేశభక్తి , సనాతన ధర్మం గురించి ఆలోచించే బీజేపీ […]
CM Revanth Reddy to Attend Bhadrachalam Sri Sita Rama Kalyanam: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. కాగా, సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతతో కలిసి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ […]