Home / Telangana News
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలు తీసింది. పెళ్లైందని చెప్పినా వినిపించుకోకుండా ఆ మృగాడు ఆ మహిళకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. ఫోన్ ఎత్తకపోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అంతటితో ఆగక ఆమె భర్తను వదిలేసి రావాలని హింసించేవాడు. దానికి నిరాకరించిందని ఆ మహిళను నేడు బీర్ బాటిల్తో గొంతుకోశాడు.
బిడ్డ పుడితే నామకరణం అనేది మధురానిభూతిని పంచే ఓ కుటుంబ పండుగ. ఆ ఆనంద క్షణాల కోసం ఆ ఇంటి పెద్దలు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. మరింతగా సంబరిపడిపోతుంటారు. జన్మించిన బిడ్డలకు తమకు నచ్చిన విధంగా పేర్లను పెట్టుకొంటుంటారు. ఇది ప్రతి వక్కరికి తెలిసిందే. కాని పుట్టిన మా లక్ష్మికి నామకరణం చేసేందుకు 9ఏళ్ల పాటు నిరీక్షించారు ఆ జంట. చివరకు వారి కల సాకరం కావడంతో తబ్బిబ్బై సంబ్రమాశ్చర్యాలకు లోనైన ఆ సంఘటన తెలంగాణాలో చోటుచేసుకొనింది
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఎంఐఎం స్వాతంత్ర్య సమరయోధులు తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ల వారసులని, ఖాసిం రిజ్వీ కాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.టీఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ బైక్ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది. అమిత్ షా కాన్వాయ్ ని తెరాస నేత కారు అడ్డగించింది.