Home / Telangana News
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతుంది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
కేవలం నాలుగు రోజుల్లోనే ఓ యువకుడి ఆ మాయలేడి నట్టేటా ముంచేసింది. మొదట తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది. ఆపై మాటలు కాస్త వీడియోకాల్స్ దాకా వెళ్లాయి ఆపై మరికాస్త సృతిమించి యువకుడి చేత దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించింది ఆ యువతి..ఇంక అంతే ఆ వీడియోతో ఆ యువకుడి కొంప కొల్లేరయ్యింది. న్యూడ్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించసాగింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన విశ్వనగరమైన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్టాప్లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మహిళ అనుహ్యరీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది.
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.