Home / Rahul Gandhi
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో మంగళవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మధ్య అనూహ్య భేటీ జరిగింది. వీరిద్దరూ ప్రార్థనల కోసం కొండపైనున్న ఆలయానికి వెళ్లినపుడు అనుకోకుండా కలసుకున్నారు.
భారత్ జోడో యాత్ర రెండో దశ ఈ ఏడాది డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిగే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గత ఏడాది సెప్టెంబర్ 7 నుండి జనవరి 30, 2023 వరకు మొదటి దశ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన ప్రసంగించారు.
చాలా మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు టేప్ అవుతున్నాయని, మొబైల్ దిగ్గజం యాపిల్ పంపిననోటిఫికేషన్ను ఉటంకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. తమ ఐఫోన్లను స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్లు రిమోట్గా రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా