Home / Rahul Gandhi
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్వాయిస్ చేసి రూ. 32,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్పై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన మిజోరంలో మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి మరియు భారత ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది. కానీ మణిపూర్లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విడుదల చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతెలిపారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సుయాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ప్రార్థనలు చేసి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ ప్రైవసీని గౌరవించాలని పార్టీనేతలు కార్యకర్తలకు చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్లోని ఫర్నిచర్ మార్కెట్ను సందర్శించి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంఢించి కాంగ్రెస్ పంచుకున్న వీడియోలు మరియు చిత్రాలు రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి.