Home / Rahul Gandhi
హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్సింగ్ బజ్వా చెప్పారు.
బెంగళూరు కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.
లోకసభ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 272 సీట్లకు గాను 240 సీట్ల వద్ద చతికిలపడింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్లో ఉంది. అంచనాకు మించి సీట్లు దక్కించుకుంది.
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్తో కలిసి వెంట నడిచారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్లోని పాలీగంజ్లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.
దేశంలోని వైస్చాన్సలర్లు, విద్యావేత్తలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై భగ్గుమంటున్నారు. ఆయనకు బహిరంగంగా లేఖ కూడా రాశారు. దీనికంతటికి కారణం దేశంలోని వీసీ అపాయింట్ మెంట్లు కేవలం ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగిన వారికి మాత్రమే దక్కుతున్నాయని రాహుల్ ట్విట్ చేశారు.
గతంలోని బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజాన్ని అణిచి వేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జార్ఖండ్లో శనివారం నాడు ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. పొరుగు దేశంతో శాంతి కోసం వెంపర్లాడేందుకు ప్రేమ లేఖలు పంపించేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి బదులుగా పాకిస్తాన్ దేశంలోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పంపి అమాయకులను ఊచకోత కోసేది.