Home / Rahul Gandhi
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్కు నేటితో తెరపడింది. ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ లోకసభ సీటుకు నామినేషన్ ఫైల్ చేశారు. కాగా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆయన వెంట మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు వచ్చారు.
ఎట్టకేలకు అమెథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ఎవరూ పోటీ చేస్తారనే సస్పెన్స్ తెరపడింది. రాహుల్ గాంధీ అమెధీ నుంచి కాకుండా తన తల్లి నియోజకవర్గం అయిన రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో రాహుల్గాంధీపై సెటైర్లు విసిరారు. 'డరో మత్, బాగోమత్" అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్లో కూరుకుపోయిన జెడి ఎస్యుతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని మాస్ రెపిస్టు కోసం ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. క
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.
జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే జనవరి 14నుంచి మరోసారి పాదయాత్ర నిర్వహించనున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరిట జనవరి 14నుంచి మార్చి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 21న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరోసారి రాహుల్ గాంధీ యాత్ర చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.
గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ కి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారని తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో శర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు.