Home / Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26 నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో పవన్ పాలు, పండ్లు మరియు ద్రవాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
కాపు ఉద్యమ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
రాజమండ్రి జైలు సాక్షిగా...జనసేన, టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే..ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న పవన్ అక్కడనుంచి అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్బంగా ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.