Home / national news
బెంగళూరు మిల్లర్స్ రోడ్లోని తన విలాసవంతమైన ఇంట్లో కూర్చున్న యూసఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కార్యకర్తలను కలవడంలో బిజీగా ఉన్నారు. అయితే అతనికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు. కాని చిక్పేట అసెంబ్లీ సీటు
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన పౌర సమాజానికి చెందిన సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రాంతీయ వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక సంఘటనలు లేదా స్మారక చిహ్నాలు లేదా వారి ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఢిల్లీతో సహా 23 ఎయిమ్స్లకు నిర్దిష్ట పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక మత్స్యకారులు సోమవారం కేరళలోని తిరువనంతపురంలో నిరసన చేపట్టారు.
తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
మిజోరాం సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే వైద్యుడి పై దాడి చేసింది. అపాయింట్ మెంట్ లేకుండా క్లీనిక్ లోనికి అనుమతి లేదని చెప్పడంతో ఓ వైద్యుడి పై తన ప్రతాపం చూపించింది. విచక్షణ కోల్పోయిన వైద్యుడి పై దాడికి దిగింది.
ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ మరియు అతని సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో100 బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు