Home / national news
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించగా 13 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
తాను భారత సైన్యంలో చేరాలనుకున్నానని, అయితే కుటుంబ కారణాల వల్ల కుదరలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అస్సాం రైఫిల్స్ మరియు భారత సైన్యంలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను కూడా సైన్యంలో చేరాలని కోరుకున్నాను.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాల పంపిణీకి ఉపయోగించే డ్రోన్ను అడ్డగించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ర్పింగ్ కాళ్లతో డ్యా్న్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్లకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్ఘడ్ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్ బీచ్లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది.
భారతదేశం యొక్క జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తున్న ఒకదానితో సహా ఎనిమిది యూట్యూబ్ ఛానెల్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.