Home / national news
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 43,000 దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్కదానికి రూ.60,000 ప్రకటించారు. అయితే ప్రకటన వెలువడిన వెంటనే ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు పిల్లు దాఖలయ్యాయి.
ప్రజలు తమ వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన దినంగా జరుపుకోవాలని కలలు కంటారు. దీనికోసం కొందరు విలాసవంతమైన పార్టీలు చేస్తారు. మరికొందరు ఆకర్షణీయమైన దుస్తులను ధరిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) చైర్మన్గా సమీర్ వి కామత్ను నియమించారు. డిఆర్డిఓలో నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కామత్, జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారు.
ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్ల నిర్మాణ వ్యయంమొత్తం రూ.70 కోట్లు. అయితే, దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ దాఖలైన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. 2007లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలైంది.
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఉచిత ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు, ఆ అంశాన్ని శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించింది. విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం "ఎన్నికల ప్రజాస్వామ్యంలో, నిజమైన అధికారం
మేఘాలయ ప్రభుత్వం తాజాగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు విషయాన్ని మేఘాలయ ట్యాక్సేషన్ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం పెట్రోల్ పై పన్నును లీటరుకు రూ.12.50కు లేదా 13.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో జార్ఖండ్ రాజ్ భవన్కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులకు ఈ-పాస్పోర్ట్లను ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే 6 నెలల్లో ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్లను జారీ చేస్తామని విదేశీ వ్యవహారాల కార్యదర్శి (కాన్సులర్, పాస్పోర్ట్, వీసా & ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్)