Home / national news
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ఇటీవల ఢిల్లీ పర్యటన పై విలేకరులు ప్రశ్నించగా వారికి ఊహించని సమాధానం ఎదురయింది. నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాను.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.
జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో గురువారం ఉదయం రిక్టర్ స్కేలు పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన నివేదికలో పేర్కొంది. కత్రా కు 62 కిమీ తూర్పు-ఈశాన్యం దిశగా ఉదయం 07:52 గంటలకు సంభవించింది.
ఇళ్లన్నాక గొడవలు సహజం. అందులోనూ అత్తాకోడళ్లు అయితే మరి చెప్పనక్కర్లేదు. అత్తాకోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేసిన భగ్గుమంటుంది అన్న నానుడి ఊరికే రాలేదండోయ్. కొన్ని కలహాలు కుటుంబాన్ని చీల్చితే, మరికొన్ని ప్రాణాలను కూడా తీస్తుండడం మనం ఇటీవలె కాలంలో చూస్తూనే ఉన్నాం.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ సమీపంలో గురువారం పసికందు మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత, పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న బాలిక ద్వారా శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది.
ఇకపై కారులో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు కూడ సీటు బెల్ట్ ధరించాలి. లేకుంటే వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.
పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో చేరి వారి చదువును పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాతీయవైద్యమండలి ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ను గుర్తించడానికి అంగీకరించింది.