Home / national news
బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, కేంద్ర ఎన్నికల కమిటి ప్రకటించింది. పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించగా.. కేంద్ర ఎన్నికల కమిటిలో 15 మందికి అవకాశం కల్పించారు.
ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది.
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.
విశిష్ట గుర్తింపు అథారిటీ (UIDAI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై వరకు మొదటి నాలుగు నెలల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 79 లక్షల మంది పిల్లలను నమోదు చేసింది. వీరికి బాల్ ఆధార్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ... రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నారు. అయితే స్వాంతంత్ర్య దినోత్సవం నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడ వారిని స్మరించుకుంటూ పూజలు చేసే దేవాలయం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరించుకుంటోంది. మరోవైపు జర్మనీలో నివసిస్తున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ ఫాఫ్ నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు నవాబ్ మాలిక్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డైరక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖకు చెందిన ముంబై జిల్లా కుల ధృవీకరణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆయన ఈ చర్య తీసుకున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎర్రకోటలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా అంగన్వాడీ కార్యకర్తలు, వీధి వ్యాపారులు, మార్చురీ వర్కర్లు, ముద్రా పథకం రుణగ్రహీతలు పాల్గొన్నారు.