Home / national news
నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ద్వారా సూపర్టెక్ లిమిటెడ్ రియల్టీ కంపెనీకి సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం విషయానికి వస్తే నిర్మాణ వ్యయంతో పాటు బ్యాంకు వడ్డీలు తదితర అంశాలు కలిసి ఉన్నాయయని కంపెనీ చైర్మన్ ఆర్ కె అరోరా అన్నారు.
కాంగ్రెస్లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావుతో పాటు మరో నలుగురిపై నమోదైన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 (పోక్సో) కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఒక ట్రయల్ కోర్టు శుక్రవారం పాజీ ఫారెక్స్ సంస్థల డైరెక్టర్లు కె మోహన్రాజ్ మరియు కమలవల్లికి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 171.74 కోట్ల సామూహిక జరిమానా విధించింది. వీరు రూ. 870.10 కోట్ల మేరకు డిపాజిటర్లనుమోసం చేసారు.
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరో ఇద్దరిని గోవా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్రూమ్లో డ్రగ్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ యొక్క స్వభావం ఇంకా ధృవీకరించబడలేదు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ డ్రగ్ ఏంటన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఎన్నికల సంఘం ఆగస్టు 26న అనర్హత వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు జార్ఖండ్ సీఎం అధ్యక్షతన రాంచీలోని తన నివాసంలో అధికార జార్ఖండ్