Home / national news
మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిన మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుకు జైలులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో శుక్రవారం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించి, భారత నావికాదళం కోసం కొత్త నౌకాదళజెండాను ఆవిష్కరించారు. 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను ఛత్రపతి శివాజీకి అంకితం చేసిన ప్రధాని,
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
దేశమంతటా గణేష్ చతుర్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోవాలోని ఒక కుటుంబానికి చెందిన సభ్యులు కూడ అందరూ ఒక చోట చేరి ఈ పూజను చేసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజకు ఏకంగా 250 మంది కుటుంబ సభ్యలు హాజరయ్యారు. వారు ఉంటున్న భవనం 288 ఏళ్ల నాటిది.
ఇండోర్కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది.
ఆదాయపు పన్ను శాఖ కోల్కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరియు అతని ముఖ్య సహచరులకోసం నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నగదు రివార్డును ప్రకటించింది. దావూద్కు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.25 లక్షలు, ఛోటా షకీల్కు రూ.20 లక్షలు అందజేస్తారు.
ప్రభుత్వం డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కి పెంచింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ఎగుమతులపై పన్ను కూడా సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా లీటరుకు 2 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచబడింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. అంతకు ముందు వరకు పెరిగిన గ్యాస్ ధరల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మనం అందరికీ తెలిసిందే. మనం వాడుకునే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ రేట్లు ఒక్కసారిగా కంపెనీలు తగ్గించేశాయి.