Last Updated:

Uday Umesh Lalit : 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Uday Umesh Lalit : 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

Uday Umesh Lalit : భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, జస్టియ్‌ యూయూ లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‎లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: