Home / Latest Nartional News
గాంధీనగర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ( సిడిఆర్ సి ) అహ్మదాబాద్కు చెందిన సర్జరీ ప్రొఫెసర్ అపూర్వ షాకు ఖర్చు మరియు వడ్డీతో సహా పరిహారం అందించాలని ఎయిర్ ఇండియా లిమిటెడ్ని ఆదేశించింది.ఎయిర్ ఇండియా లిమిటెడ్ తన పెంపుడు పిల్లితో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లేందుకు నిరాకరించడంతో డాక్టర్ షా పరిహారం కోరారు.
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్ గురువారం లండన్కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కిరణ్దీప్ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ) ఉల్లంఘనపై ఆక్స్ఫామ్ ఇండియా మరియు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని దాని కార్యాలయంలో బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ సందర్బంగా సీబీఐ ఢిల్లీలోని ఆక్స్ఫామ్ ఇండియాకు సంబంధించిన నేరారోపణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది.
మావోయిస్టు సంబంధాలపై దోషులుగా తేలిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం పక్కన పెట్టింది.
కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించే 'సేఫ్ కేరళ' ప్రాజెక్ట్ ఏప్రిల్ 20 నుండి ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు కేరళ మోటారు వాహనాల విభాగం రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలోని బెంగాలీ మార్కెట్ మరియు చాందినీ చౌక్ ప్రాంతంలో వివిధ రుచికరమైన స్నాక్స్ ను అస్వాదిస్తూ ప్రజలతో మాట్లాడారు. బెంగాలీ మార్కెట్ వద్ద, రాహుల్ గాంధీ తన అంగరక్షకుల బృందం అతని చుట్టూ ఉండగా గోల్ గప్పాలను తిన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. యుసిసిపై కేంద్రం జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. దీని తరువాత ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లును తీసుకురావచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
అస్సాం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఒకటి 11,304 బిహు కళాకారుల సాంప్రదాయ నృత్యంతో మరియు మరొకటి అతిపెద్ద డ్రమ్మింగ్ ప్రదర్శన. ఇందులో 2,548 మంది పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం పంపిన లేఖపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య మళ్లీ మాటల యుద్ధంమొదలైంది.ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపగా, వాటిలో బెంగాల్ ఒకటి. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ఆధార్ కార్డులను, ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించాలని పేర్కొంది.
పోలీసులు, డ్రగ్స్ డీలర్ల మధ్య బంధంలో ఉన్నారనే ఆరోపణలపై వివాదాస్పద పోలీసు అధికారి రాజ్జిత్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. రాజ్జిత్ తన సంపద మూలాలపై విజిలెన్స్ విచారణను కూడా ఎదుర్కొంటారని మాన్ చెప్పారు.