Home / latest ap news
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]
తుని రైలు దహనం కేసుని విజయవాడ రైల్వేకోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, నటుడు జివి సహా 41మంది నిందితులని కేసునుంచి విముక్తులని చేస్తూ తీర్పు ఇచ్చింది
MLA Shankar Narayana : పెనుగొండ ఎమ్మెల్యే మానుకొండ శంకర్ నారాయణ పైన గ్రామస్థులు రాళ్ళ దాడి చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దాడికి గల కారణాలు ఏంటి.. ఈ విషయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఎండలు పట్టా పగలే చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు వానలు కూడా దంచికొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ప్రతియేటా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలను మనం గమనించవచ్చు. క్షణికావేశంలో పరీక్షలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని ఈ లోకాన్ని వీడుతున్నారు విద్యార్దులు. తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు వారికి తగినంత మేర విద్యార్ధులను ప్రోత్సహించి.. తొందరపాటు నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది.