Home / latest ap news
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం (బందరు) తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు.
అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వోచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడే ఉండాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మండే ఎండాలకు తోడు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కారణంగా ముగ్గురు మరణించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగినట్లు సమాచారం అందుతుంది. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని
ఓ పదేళ్ల బాలుడు కేవలం ఒక టవల్ చుట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ది కూడా తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి.. చదవడానికి కొంచెం షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. మరి ముఖ్యంగా తన తల్లి పై ఎందుకు ఫిర్యాదు చేయాలని అని అనుకున్నాడో తెలిస్తే ఇక బుర్రపాడు అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది.
స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నేడు ( మే 15, 2023 ) న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. నర్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, అలంపూర్ మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లుగా ప్రమాణం చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 వరోజుకు చేరుకుంది. లోకేష్ ఇప్పటికి 1200 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ కు అభినందనలు తెలిపారు.