Home / latest ap news
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నగరం ప్రాముఖ్యతను, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూరాజధాని పేరును కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు.
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 3వ రోజు పిఠాపురంలో పర్యటించారు. ఉప్పాడ కొత్తపల్లిలో తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పవన్కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాకినాడ కలెక్టరేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పి.హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్. మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు
ఎవరైతే నాకేంటి..సీఎం అయినా...పీఎం అయినా ఐ డోంట్ కేర్..లంచం ఇస్తేనే పని అవుతుంది. పచ్చనోట్లు చేతిలో పడితేనే పని. లేకపోతే ఫైల్ పెండింగే..లంచం ఇవ్వండి..మీకు కావాల్సిన ఫైల్స్ పై సంతకాలు పెట్టించుకోండి. నేనింతే..ఎవరేమనకున్నా నా రూటే సెపరేట్ అంటున్నాడు ఓ అధికారి.
ఏపీలో కొంతమంది టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లో కెక్కారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ఇవాళ ప్రారంభించారు.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.