Home / latest ap news
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన్ను ఇవాళ ఉదయమే జైలుకు తరలించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది.
వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.
సోమవారం సుమారుగా మూడు గంటల పాటు చర్చించిన ఏపీ కేబినేట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. అన్నిటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరావు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కందుల దుర్గేష్ కొద్దిరోజులకిందట ఏపీ క్యాబినెట్లో పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి