Home / KTR
BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రజతోత్సవ […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పీఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]
BRS Working President KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. రాజేంద్రనగర్లో పట్లోళ్ల కార్తీక్రెడ్డి గెలిస్తారని జోస్యం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలే నష్టపోయారని తెలిపారు. రేవంత్రెడ్డి మాయమాటలకు వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారని తెలిపారు. మతం పేరు పలుకకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీ పార్టీకి ఉందా? అని సవాల్ […]
BRS Working President KTR : హైదరాబాద్ నగరంలోని కాలనీలు, బస్తీల్లో గులాబీ జెండా ఎగురవేసి, ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో శనివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. […]
BRS Working President KTR : కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాలని కోరారు. ఆ 400 ఎకరాల భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సెంట్రల్ […]
KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశం తరహాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని స్పష్టం చేశారు. […]
TPCC Chief Mahesh Kumar Goud : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని […]
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కారు ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. ప్రజాపాలనలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూమిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందన్నారు. 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక రూ.10 వేల కోట్ల కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి […]
BRS Working President KTR Comments on SCAM: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. 400 ఎకరాలు కాదని, దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తెలిపారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని వెల్లడించారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్నారని, […]
KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ భూముల్లో చెట్లను ప్రభుత్వం తొలగిస్తుండగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి వెంటనే అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పలు ప్రశ్నలు సంధించి వివరణ ఇవ్వాలని సర్కారుకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అప్రమత్తమై మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై […]