Home / Janasena
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఎన్నారై బృందాలు కలిశాయి. ఆస్ట్రేలియ కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్కు చెందిన ఎన్నారై జనసేన నేతలు పవన్ను కలిశారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం