Home / Delhi
దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
లోక్ సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనా డిల్లీ కమిషన్ ఫర్ విమెన్పై (డీసీడబ్ల్యు) పై కన్నెర్ర జేశారు. స్వాతిమలీవాల్ డీసీడబ్ల్యు చైర్పర్సన్గా ఉన్నప్పుడు .. ఫైనాన్స్డిపార్టుమెంట్ కానీ.. లేదా అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా 233 మందిని దిల్లీ కమిషన్ ఫర్ విమెన్లో ఉద్యోగులను నియమించారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో బుధవారం 100కు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యాయి.దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం దాదాపు 110 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేస్తూ ఆలస్యాన్ని ఎదుర్కొంటోంది అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ FIDS (ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్) తెలిపింది.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ప్రధాని మోదీతో రేవంత్, భట్టి ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు.
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రాత్రి ప్రజలు బాణసంచా కాల్చడంతో అది భారీ కాలుష్యానికి దారితీసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన దృశ్యాల్లో దట్టమైన పొగమంచు వీధులను చుట్టుముట్టడం, దృష్టిని తీవ్రంగా పరిమితం చేయడం కనిపించింది.
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతుంది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు దారుణంగా క్షీణిస్తున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరగడంతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ ‘సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఆదివారం X (గతంలో ట్విట్టర్)లో ఈ ప్రకటన చేశారు.