Home / cricket news
టీ20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా పలు టీంలు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పోరులో ఐర్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్లింది. సెమీస్ రేసులో చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ టీం నిలిచింది.
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో సత్కరించడం మొదలుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.
క్రికెట్ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రోడ్సైడ్ చాయ్ని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.
T20 ప్రపంచకప్ లో జింబాబ్వే భారత్ ను ఓడిస్తే తాను జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఫస్ట్ హాప్ ముగిసే సరికి భారత్ 184 పరుగులు చేసి బంగ్లాకు185 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.
భారత క్రికెటర్లు అత్యద్భుత రికార్డులు నెలకొల్పుతు ఉంటారు. ఈ నేపథ్యంలోనే జోరుమీదున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. టీమిండియా యంగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నూతన రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా బుధవారం నవంబర్ 2న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆడిలైడ్ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా కెప్టెన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.