Home / ap news
APSRTC to operate 3500 special buses for Maha Shivaratri 2025: శివరాత్రి పండుగ వేళ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మహా శివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు […]
AP Deputy CM Pawan Kalyan Temples Tour: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా జనసేనాని యాత్ర రెండవ రోజూ విజయవంతంగా సాగింది. ఈ మేరకు ఆయన పళని, తిరుపరంకుండ్రం, మధురై క్షేత్రాలను సందర్శించారు. కుమారుడు అకీరా, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయితో ఆయా ఆలయాలకు చేరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు.. అక్కడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్శనలో భాగంగా దైవ దర్శనానంతరం పవన్ ఆయా క్షేత్రాల విశేషాలను […]
Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్తో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ […]
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం […]
Nagababu First Public Meeting Held At Punganur: మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల జనంలోకి జనం అనే కార్యక్రమానికి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఆయన సాధారణ జనంతో మమేకమైన జనసేన పార్టీ ప్రజల్లోకి ఎంత చేరువైంది, జనసేన పట్ల వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నారు. నాగబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేటి (ఫిబ్రవరి 2 ) నుంచి శ్రీకారం చూట్టారు. తొలి సభను పుంగనూరు […]
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా […]
Pawan Kalyan Review Meeting: ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటోందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఖాతాలను స్థంభింపజేసే గత ప్రభుత్వ అనైతిక విధానాలను తొలగించామని స్పష్టం చేశారు. స్థానికి సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి, పంచాయతీలకు […]
Bollineni Rajagopal Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకత్తల మండలి ఛైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. టీటీడీ సంప్రదాయాల ప్రకారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు బోర్డు సభ్యులైన జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరరావు, పనబాక లక్ష్మి, […]
Pawan Kalyan Review Meeting Officials: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నంచి ఉపాధి హామితో పాటు, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం […]
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ […]