Home / ap news
ఏపీ మంత్రులకు నవంబర్ ఫీవర్ పట్టుకుందా? ఆ విషయంలో ఏపీ మంత్రులు భయపడుతున్నారా?
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్వహించే దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. విజయదశమి సందర్భంగా ఊరేగే ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.
వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. శీతాకాలం వస్తున్నా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ భారీ వానల ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.
దసరా సెలవులు ఆ ఇళ్లల్లో విషాదాన్ని నింపాయి. సరదాగా విహారయాత్రకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది.
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కట్ చెయ్యాల్సింది పోయి చిన్నారి చిటికెన వేలుని కత్తించారు ఆ నిర్లక్ష్యపు వైద్యులు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
బూతులు మాట్లాడం లో పోటీ పడుతున్న నేతలు..వైసీపీ పై జనసేన పంచులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో వివాదం రేగుతున్న సమయంలో మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు