Home / Andhrapradesh
AP Legislative Council : ఏపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత నాగబాబు సతీసమేతంగా మండలి చైర్మన్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఆఫీస్కు వచ్చారు. ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. బీజేపీ […]
Ration Cards : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రి ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కుటుంబ రేషన్ కార్డును సైజు […]
Rampachodavaram : అల్లూరి జిల్లా దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వై.రాయవరం మండలం పాముగుంది గ్రామానికి చెందిన సాదల కళావతి గుత్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో గుర్తుతెలియని మహిళ వారి వద్దకు వచ్చి పాపను ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అని భావించిన తల్లిదండ్రులు పాపను సదరు ఆమెకు […]
RK Roja : ఏపీలో కూటమి సర్కారుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడన్నారు. ఇవాళ ట్విటర్లో కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పట్టడం లేదని విమర్శించారు. సంప్రదాయం ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలన్నారు. అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసం కూడా అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయాలను పాటిస్తే […]
Supreme Court : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా పనిచేసిన సంజయ్ అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీంతో సంజయ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం […]
Kakani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. […]
Drought Hit Mandals : కరువు ప్రభావిత మండలాలను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా […]
P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని, అందుకే వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్షిప్గా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. […]
Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్ల కింద ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానన్నారు. తన మాట […]
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న […]