Home / AAP MP Raghav Chadha
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సమర్పించిన తీర్మానంపై ఐదుగురు రాజ్యసభ ఎంపీలు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని సోమవారం ఆరోపించడంతో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాదంలో చిక్కుకున్నారు. 'ఫోర్జరీ' ఘటనలో దోషిగా తేలితే రాఘవ్ చద్దాపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని రాజ్యసభ ఛైర్మన్ సిఫారసు చేయవచ్చని తెలిసింది.