Last Updated:

RT-PCR : జనవరి 1 నుంచి చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌

RT-PCR : పలు దేశాల్లో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు

RT-PCR : జనవరి 1 నుంచి  చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌

RT-PCR : పలు దేశాల్లో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదిక తప్పనిసరి చేసింది. కొత్త సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ రోజు తెలియజేశారు.

చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1, 2023 నుంచి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నివేదిక తప్పనిసరి. ఆ దేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో తమ వైరస్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి అని మాండవీయ వెల్లడించారు. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో అమల్లో ఉన్న 2 శాతం మందికి రాండమ్ పరీక్షల నిబంధనకు ఇది అదనమని తెలిపారు.

చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా విదేశాల నుంచి వచ్చే విమానాల్లో 2 శాతం మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.11శాతంగా ఉంది. అయినప్పటికీ వచ్చే 40 రోజులు కీలకమని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే దేశంలో మరో కొవిడ్ వేవ్‌ వచ్చినప్పటికీ.. ఈ సారి వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.దేశంలో మొదటివేవ్‌ తర్వాత దేశవ్యాప్తంగా పౌరులకు కోవిడ్‌ రెండు టీకాలతో పాటు బూస్టర్‌ డోస్‌ ఇవ్వడంతో ప్రస్తుతం భారత్‌కు పెద్ద ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: