Last Updated:

Heeraben Modi : విషాదంలో మోదీ… తుదిశ్వాస విడిచిన హీరాబెన్ మోదీ

Heeraben Modi : విషాదంలో మోదీ… తుదిశ్వాస విడిచిన హీరాబెన్ మోదీ

Heeraben Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోదీ పలు సందర్భాల్లో గుర్తు చెప్పేవారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు.

ఇటీవలే ఆమె 100వ పుట్టిన రోజును కూడా జరుపుకున్నారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. ఆమె మరణంతో మోదీ తీవ్ర వేదనలో మినిగిపోయినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: