Home / జాతీయం
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మొదటి సర్వీసును 2026లో నడిపే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఒక వార్తాసంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేసామని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్లో చెప్పారు. విచారణ జరుగుతోంది. వన్యప్రాణుల అక్రమరవాణాను సహించబోమని తెలిపారు.
ఉద్యోగాల కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్సిసి పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన 2016 రిక్రూట్మెంట్ ప్యానెల్ మొత్తాన్ని కలకత్తా హైకోర్టు సోమవారం రద్దు చేసింది. సుమారుగా 24,000 ఉద్యోగాలను కోర్టు రద్దు చేసింది. వీటిలో బెంగాల్లోని వివిధ రాష్ట్ర-ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలలకు 2016లో ప్రవేశ పరీక్ష ద్వారా నియమించబడిన బోధన, బోధనేతర సిబ్బంది యొక్కనియామకాలు ఉన్నాయి.
14 ఏళ్ల అత్యాచార బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. దీనికి వ్యతిరేకంగా బాంబే హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్బం దాల్చింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఇంకా పూర్తికాకుండానే బీజేపీ బోణీ కోట్టేసింది. గుజరాత్ లోని సూరత్ లోక్సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోటీలో మిగిలిన అభ్యర్దులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్ది ముఖేష్ దలాలీ ఏకగ్రీవంగా గెలుపొందారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ను ఢిల్లీలోని జంగ్పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.
లడఖ్లో చైనా సైన్యం చొరబాట్లు పెరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులతో వాగ్వాదానికి దిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞాన్వాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో పూజలకు అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు లోపల మూసివున్న 'వ్యాస్ కా టెఖానా'లో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే ఏడు రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.
ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్చేశారు.