Home / జాతీయం
: చత్తీస్గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందన్నారు.
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం గురించి యావత్ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్ శనివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్ హబ్.. దీన్ని కాస్తా కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్ కోట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు.
గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) మరియు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్త ఆపరేషన్లో పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్గఢ్లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
మన దేశంలో ఎన్నికలంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే చిన్న గ్రామాల నుంచి అతి పెద్ద నగరాల వరకు ఎన్నికల సందడి మొదలవుతుంది. రాజకీయ పార్టీల కార్యకర్తల హడావుడికి అంతే ఉండదు. బ్యానర్లతో , లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. శుక్రవారం నాడు కర్ణాటకలో పోలింగ్ జరిగింది.
డిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిల్లీ మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడింది. జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్టేషనరీతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేయడంలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోర్టు ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.
ఇటీవల కాలంలో విదేశాల నుంచి దేశంలోకి బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. మన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దుబాయి నుంచి బంగారం కొనుగోలు చేసి ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండవ విడత పోలింగ్ ముగిసింది. అయితే అందరి దృష్టి గాంధీలకు కంచుకోట అయిన అమెధీ, రాయబరేలిపై పడింది. ఈ రెండ నియోజకవర్గాల నుంచి రాహుల్, ప్రియాంకాగాంధీలు పోటీ చేయాలి. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం పది దాటిందంటే ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ర్టాల్లో నీటి ఎద్దడి క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. నీటి నిల్వలు కేవలం 17 శాతానికి దిగివచ్చాయి.