Home / జాతీయం
ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే.
భారతదేశం మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు భారతదేశంలోని అలహాబాద్లో 1889లో జన్మించిన పండిట్ నెహ్రూ 133వ జయంతి.
తమిళ భాష మరియు దాని వ్యాకరణం ప్రపంచంలోనే పురాతనమైనవని వాటికి ప్రాచుర్యం తేవడం దేశం యొక్క బాధ్యత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా.. ఆ వ్యక్తి మన కన్నా ముందో వెనుకో చనిపోక తప్పదు అనే నిజాన్ని మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అంటే ఓ కుటుంబం చేసిన ఈ వింత పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. చనిపోయిన వారు బతికొస్తారంటూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా మూడురోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు.
చచ్చి బతికాడురా, అదృష్టం అంటే ఇదేరా అనే పదాలను కొన్ని సార్లు కొంత మందిని చూస్తే నిజమే అనిపిస్తుంది. బీహార్లో భాగల్ పూర్లో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు ఇలానే అనకమానరు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసెయ్యండి.
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి 'అనుమతి' ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ (జిఆర్ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.