Home / జాతీయం
చండీగఢ్ మేయర్ ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మనోజ్ సోంకార్ విజేతగా నిలిచారు. మొత్తం 36 ఓట్లకు గాను 16 ఓట్లు బీజేపీ దక్కించుకోగా ఆప్ పార్టీకి 12 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అనిల్ మాసి తేల్చడంతో ఆప్ పార్టీ బీజేపీపై మండిపడుతోంది.చండీగడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్లు రెండు కలిసి పోటీ చేశాయి.
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేసిన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్లో రంజిత్ హత్యకు గురయ్యారు.
ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం -యూఏపీఏ కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సుప్రీంకోర్టు సోమవారం గడువును పొడిగించింది.
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 56 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియనుంది.
బీహార్లో మహాఘట్బంధన్ అధ్యాయం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు.తన రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నితీష్ బీజేపీని వీడి ఆర్జెడీ - కాంగ్రెస్తో జట్టు కట్టి మహాఘట్బంధన్గా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం జెడ్+ సెక్యూరిటీ మంజూరు చేసింది.అధికార సీపీఐ(ఎం) పార్టీ విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నల్ల జెండా ప్రదర్శనపై గవర్నర్ రోడ్డు పక్కన కూర్చోని నిరసనకు దిగిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించిందని, పార్టీ మారేందుకు వారికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిన బీజేపి ఆప్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిందని ఆయన పేర్కొన్నారు.