Home / జాతీయం
అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగాపాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం భారత విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్కు ఉత్తరాన ప్రవేశించి రాత్రి 8:01 గంటలకు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది.
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్ను పొడిగించింది.
ఏపీలో తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించియా విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని.. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటామని..
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతారణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం తెలిపింది. ప్రస్తుతం ఉత్తర- ఈశాన్య దిశగా కదులుతోందని ప్రకటించింది.
గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది.
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు