Home / జాతీయం
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు
భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బీహార్లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టిందని అధికారులు తెలిపారు. 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.5 కోట్ల నగదు, రూ.11 కోట్ల ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ తన భర్త భగవంత్ మాన్కు పంజాబ్ ముఖ్యమంత్రి కుర్చీని బహుమతిగా ఇచ్చారని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు పంజాబ్కు నాయకత్వం వహించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూను కోరారని తెలిపారు. అయితే ఆయన తన పార్టీకి ద్రోహం చేయకూడదని నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు.
న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయే శ్రీ అమర్నాథ్ యాత్రలో యాత్రికులు కూల్ డ్రింక్స్, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జిలేబీ మరియు హల్వా వంటి స్వీట్లు, పూరీలు తీసుకోలేరు
: తన సహజీవన భాగస్వామిని చంపి, ఆపై ఆమె శరీర భాగాలను నరికి, ఉడకబెట్టినందుకు అరెస్టయిన మనోజ్ సానే తాను సరస్వతి వైద్యను చంపలేదని పోలీసులకు చెప్పాడు.జూన్ 3న సరస్వతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని మనోజ్ పోలీసులకు తెలిపాడు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి బుధవారం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. గుజరాత్కు చెందిన ప్రతీక్ దోషితో వాంగ్మయి వివాహం జరిగింది.
బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.
బ్రేక్ ప్యాడ్లు రాపిడి కారణంగా పూరీ-దుర్గ్ ఎక్స్ప్రెస్ యొక్క ఏసీ కోచ్ లో మంటలు రేగాయని రైల్వే అధికారి తెలిపారు. దీనితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఖరియార్ రోడ్ లో రైలు నిలిపివేసారు. రైలు గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్కు చేరుకోగానే బి3 కోచ్లో పొగలు కనిపించాయని తెలిపారు