Home / జాతీయం
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఖాప్ 'మహాపంచాయత్' ముగిసింది. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ మరియు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని కోరారు.
ప్రధాన స్నానాల పండుగ తేదీలను ప్రకటించే హోర్డింగ్తో 2025లో జరిగే మహా కుంభమేళాకు అధికారికంగా కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం వెలుపల హోటల్ రాహి ఇలావర్ట్ ప్రాంగణానికి సమీపంలో 45 రోజుల పాటు జరిగే ఈ మెగా మతపరమైన ఉత్సవాల గురించి తెలియజేస్తూ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో, సముద్రంలో పడేసిన రూ.20.2 కోట్ల విలువైన 32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గంలో రామేశ్వరం మండపం ప్రాంతం గుండా బోటులో పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాకు చెందిన రెండు నివాసాలపై పోలీసులు దాడిచేసి భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఛేదించారు. అక్కడ అధిక నాణ్యత గల డ్రగ్ ను తయారు చేసి విదేశాలకు రవాణా చేయడానికి ముంబై మరియు కోల్కతాలోని ఓడరేవులకు పంపినట్లు వారు తెలిపారు.
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఇంటరాక్షన్లో భారత్ లోని ప్రతిపక్షాల ఐక్యత, బలం గురించి విశ్వాసం వ్యక్తం చేసారు.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని కోరారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారు
: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇద్దరు ప్రధానులు ప్రత్యేక మరియు విశిష్టమైన ఇండో నేపాల్ సంబంధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చలు జరిపారు
ఎన్సీఈఆర్టీ 10వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం, రాజకీయ పార్టీలు మరియు ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే అధ్యాయాలను తొలగించడం తాజా వివాదానికి దారితీసింది. తొలగింపులు 10వ తరగతిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం 'డెమోక్రటిక్ పాలిటిక్స్' బుక్ 2 నుండి ఉన్నాయి.