Home / తాజా వార్తలు
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.
ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి వైసీపీ షాక్ ఇచ్చింది . జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికయి పార్టీ ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది.
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు సమీకరించాలని అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మధురానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రహ్మత్ నగర్లోని బంగారు మైసమ్మగుడివద్ద ఉంటున్న శ్రీనాథ్.. పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉన్న ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.
కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం 9.28 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్ను మూశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జల్ విలాస్ ప్యాలెస్ అధికారులు మాత్రం గురువారం నాడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.