Published On:

Indian Navy: విశాఖలో తూర్పు నావికా దళం మాక్ డ్రిల్‌

Indian Navy: విశాఖలో తూర్పు నావికా దళం మాక్ డ్రిల్‌

Indian Navy :  విశాఖలో తూర్పు నావికా దళం సివిల్ మాక్ డ్రిల్‌కి సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంతో కలిసి మాక్ డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో INS విశాఖ, INS సూరత్, INS ముర్మాగం, INS కొచ్చి జలాంతర్గాములు సిద్ధంగా ఉండగా.. వార్ షిప్స్, సబ్ మెరైన్స్‌లలో పని చేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మాక్‌డ్రిల్ జరగనుండగా.. దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ జరగనుంది. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ మేరకు డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన ప్రాంతాల జాబితాను కేంద్రం విడుదల చేసింది.

 

పహెల్గాం దాడి తరువాత పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. భారత్ తో యుద్ధం వస్తే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలన్నీ తమకు మద్దతు పలుకుతాయని పాకిస్తాన్ భావించింది. అయితే అలా జరగలేదు. పాకిస్తాన్ కు మద్దతు పలికే విషయంలో ముస్లిం దేశాలు మౌనాన్నే ఆశ్రయించాయి.

భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్న దేశం. రెండు దేశాలలోని ఆయుధాలను బేరీజు వేసినా, భారతదేశం ముందు పాకిస్తాన్ నిలవలేదు. అయితే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయి. అంతేకాదు అణ్వాయుధాలు ఎప్పుడు ప్రయోగించాలన్న విచక్షణ కూడా ఇస్లామాబాద్ పాలకులకు లేదు. ఈ నేపథ్యంలో యుద్ధం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు ఉగ్రవాద దాడులు జరిగినా, పాకిస్తాన్ ఒకటే పాట పాడుతుంటుంది. ఆ ఉగ్రదాడితో మాకేం సంబంధం లేదు. దీంతో పాటు మరో మాట కూడా అంటూ ఉంటుంది. ఉగ్రదాడిపై నిష్పాక్షిక సంస్థ కు మేం సిద్ధం. పహెల్ గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్తాన్ ఇదే పాట పడింది. ఇప్పుడు భారత్ చూస్తూ ఊరుకునే పరిస్థితి కనపడటంలేదు. ఇప్పటికే యుద్ధానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది