Last Updated:

NewsClick Case: న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సీబీఐ సోదాలు

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.

NewsClick Case:  న్యూస్‌క్లిక్  కార్యాలయంలో  సీబీఐ సోదాలు

NewsClick Case: ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.

10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి..(NewsClick Case)

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ నివాసం, కార్యాలయంలో సీబీఐ బృందం సోదాలు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రచార విభాగంలో చురుకైన సభ్యుడు నెవిల్లే రాయ్ సింఘమ్ నుండి కంపెనీ మోసపూరితంగా నిధులు పొందిందని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కంపెనీ తోసిపుచ్చింది.ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో అరెస్టయిన పుర్కాయస్థ, న్యూస్‌క్లిక్ మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ కోర్టు మంగళవారం 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

న్యూస్‌క్లిక్ అక్రమ నిధుల కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి మరియు దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా జమ్మూ కాశ్మీర్, మరియు అరుణాచల్ ప్రదేశ్ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేయడం కోసం, చెల్లింపు వార్తలకోసం కోట్లాది రూపాయల విదేశీ నిధులను ఉపయోగించారని ఎఫ్‌ఐఆర్‌ తెలిపింది. షియోమీ, వివో వంటి పెద్ద చైనీస్ టెలికాం కంపెనీలు భారత్‌లో అక్రమంగా విదేశీ నిధులను చొప్పించినందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించి వేలాది షెల్ కంపెనీలను భారతదేశంలో చేర్చుకున్నాయని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, కార్యకర్త నెవిల్లే రాయ్ సింఘం మరియు రచయిత్రి గీతా హరిహరన్ ఈ చైనీస్ టెలికాం కంపెనీల ప్రయోజనాల కోసం భారతదేశంలో ఒక చట్టపరమైన కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి కుట్ర పన్నారని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.