Last Updated:

Bihar CM Nitish Kumar: నెలరోజుల్లో రెండవసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సమావేశమయిన బీహార్ సీఎం నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అతడిని కలిసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వీరిద్దరి మధ్య ఇది రెండవ భేటీ కావడం విశేషం.

Bihar CM Nitish Kumar: నెలరోజుల్లో రెండవసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో  సమావేశమయిన బీహార్ సీఎం నితీష్ కుమార్

 Bihar CM Nitish Kumar:  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అతడిని కలిసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వీరిద్దరి మధ్య ఇది రెండవ భేటీ కావడం విశేషం.ప్రతిపక్షాల ఐక్యతను చాటుతూ, 2024లో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బిజెపికి వ్యతిరేకంగా అన్ని భావాలు కలిగిన నాయకులు మరియు పార్టీలను పోటీకి తీసుకురావడానికి నితీష్ కమార్ ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి నితీష్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. ఈ సందర్బంగా ఢిల్లీ ప్రభుత్వానికి పరిపాలనా అధికారాలను అందజేస్తూ సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వులను రద్దు చేసే కేంద్రం యొక్క ఆకస్మిక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ కు మద్దతు నిచ్చారు. ఈ సందర్బంగా నితీష్ కుమార్ మాట్లాడుతూసుప్రీంకోర్టు తీర్పుతో చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించడం విచిత్రం. రాజ్యాంగాన్ని చూసి హక్కులను గుర్తించండి. ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, మీరు అధికారాన్ని ఎలా తొలగించగలరు? అంటూ ప్రశ్నించారు.

కేజ్రీవాల్ కు అండగా ఉంటాము..( Bihar CM Nitish Kumar)

ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా తీసివేయవచ్చు? ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మేము అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. దేశంలోని అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.సమావేశం అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ విపక్షాలు కలిస్తే రాజ్యసభలో బిల్లును ఓడించవచ్చని, రాజ్యసభలో ఈ బిల్లు ఓడిపోతే 2024కి సెమీ ఫైనల్ అవుతుందని అన్నారు.ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను ఆమోదించింది, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ కు విరుద్ధం. నేను నితీష్ జీతో వివరంగా చర్చించాను అతను మాకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పాడు, అని బీహార్ సిఎంతో తన సమావేశం గురించి చెప్పారు.

నితీష్ జీ ఇతర ప్రతిపక్ష నాయకులతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఈ బిల్లును వ్యతిరేకిస్తే, ఇది 2024కి సూచన అవుతుందని నేను అతనిని అభ్యర్థించానని కేజ్రీవాల్ అన్నారు. నితీష్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్, ఎన్‌సిపి, టిఎంసి మరియు బిజెడిలలోని ప్రముఖ ప్రతిపక్ష నాయకులతో ఒక రౌండ్ సమావేశాలు నిర్వహించారు.