Last Updated:

YCP Chief Jagan Mohan Reddy: మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

YCP Chief Jagan Mohan Reddy: మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.. వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి

YCP Chief Jagan Mohan Reddy: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. గురువారం  తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ నేతల సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. . మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినా ఫలితం శకుని పాచికలను గుర్తుకు తెచ్చిందని, అయితే ఆధారాలు లేకుండా మాట్లాడలేమని ఆయన అన్నారు.

40 శాతం ఓట్లు సాధించాం..(YCP Chief Jagan Mohan Reddy)

మన కార్యకర్తలకు మనం అండగా నిలవాలి. వారు మన జెండాలను మోసుకుని కష్టాలను భరించారు. మనతో పాటు నిలబడిన ప్రతి సోషల్ మీడియా కార్యకర్త మరియు వాలంటీర్‌ను రక్షించడానికి మరియు ఆదుకోవడానికి వారికి రుణపడి ఉండాలని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 40 శాతం ఓట్లు సాధించామని 2019 ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే తగ్గాయన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలవల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారి పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలు చేస్తామని, అసెంబ్లీలో తక్కువ సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మనసులోంచి ఓటమి భావాన్ని దూరం చేసుకోండి.. మనం ఓడిపోలేదని గ్రహించండి.. ప్రతి ఇంటికి మనం మంచి చేసాం. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం.. కాలం గడిచే కొద్దీ మనకు గౌరవం పెరుగుతుంది. మళ్లీ రికార్డు మెజారిటీతో గెలుస్తామని జగన్ అన్నారు.

ఇవి కూడా చదవండి: