Home / YS Jagan Mohan Reddy
YS Jagan visits the affected families : రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, వైసీపీ […]
Jagan Assets Issues: వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. కాగా, గురువారం కేసుపై ఎన్సీఎల్టీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల షేర్లు అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ పిటిషన్లో తెలిపారు. షేర్ల బదిలీ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని అతడు కోరారు. విజయలక్ష్మి, […]
YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. […]
YS Abhishek Reddy Died: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, కజిన్ డాక్టర్. వైఎస్ అభిషేక్ రెడ్డి(36) మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వైఎస్ అభిషేక్.. వైఎస్ జగన్కు సోదరుడు వరుస అవుతారు. వైఎస్సార్సీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసులోనే అభిషేక్ మరణించడంతో పార్టీ […]
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ […]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
వైసీపీ ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సందర్భంగా ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు .
అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు.