Home / Telangana High Court
High Court notices to Telangana Government: కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో ఎందుకు నిర్వహించలేదో కారణం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణలో ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు తెలపాలని సర్కారుకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ జులై 11కి వాయిదా […]
Telangana High Court On Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా స్థానికల సంస్థల ఎన్నికల గురించి పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే […]
Telangana High Court : గ్రూప్-1పై దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్-1 మెయిన్స్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై ఇవాళ ధర్మాసనంలో విచారణ జరిగింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకణంలో అక్రమాలు జరిగాయని పిటిషన్దారులు పేర్కొన్నారు. గత నెల అభ్యర్థుల పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. పునఃమూల్యాంకనం లేదా మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. దీనికి సమాధానంగా నిపుణులతో […]
Telangana High Court : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం పిటిషన్లపై న్యాయస్థానం విచారణ ముగించింది. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా గోపీనాథ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనంలో విచారణ జరుగుతుండగా, రెండు రోజుల కింద ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతిచెందారు. విషయాన్ని న్యాయవాదులు హైకోర్టు […]
Telangana high court Justice Girija Priyadarsini Passed Away: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే లేబర్ అండ్ ఇండస్ట్రీలా లో మాస్టర్స్ చదివిన ఆమె మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. […]
TGPSC : టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల పిటిషన్పై హైకోర్టులో అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. పిటిషన్పై మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ పూర్తయి తుది తీర్పు […]
CM Revanth Reddy petition in the High Court : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో కేసు ఉన్న నేపథ్యంలో దానిని కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో రేవంత్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పీఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]
Anchor Vishnu Priya Approch High Court: యంకర్ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా ఆమె హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన పలువురు సినీ,టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లు, యూట్యూబర్లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రానా, విజయ్ దేవరకొండలపై కూడా కేసు ఇందులో హీరో రానా, […]
Harish Rao Big Relief : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్టాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను ధర్మాసనం కొట్టివేసింది. పంజాగుట్ట పీస్లో ఫోన్ టాపింగ్ కేసు నమోదైంది. రియల్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా, ఇవాళ హైకోర్టు తీర్పు […]