Home / ప్రాంతీయం
ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.
మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీపీఐ నారాయణ కామెంట్ల పై నాగబాబు ట్విట్టర్ లో విమర్శించడంతో, అది మరికాస్త పెరిగింది. దాంతో చిరంజీవిపై చేసిన కామెంట్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆయన పై చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంటున్నానని తెలిపారు.
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా
తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ పై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఉన్నత విద్యామండలి పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు, ఆగస్ట్ 1న ఈ-సెట్, ఆగస్ట్ 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో.. నిన్న అర్ధరాత్రి కొంతమంది దుండగులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మట్టి పూయడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అల్లూరి విగ్రహాన్ని పాలతో విగ్రహాన్ని శుభ్రం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేయనున్నారు. వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక కాగా, వారందరికీ ఇవాళ నిధులు మంజూరు కానున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క తడబాటుకు గురయ్యారు. ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేశారు. ఆనక పొరపాటయింది. మరో బ్యాలెట్ పేపరు అడగటంతో పోలింగ్ అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క వెళ్లిపోయారు. అయితే తను ఓటు వేసే విషయంలో తాను సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నానని అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని,
తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.