Last Updated:

Vangaveeti Radhakrishna:మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

Vangaveeti Radhakrishna:మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం

Vangaveeti Radhakrishna: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

అక్టోబర్ 22న పెళ్లి..(Vangaveeti Radhakrishna)

అక్టోబర్ 22 తేదీ సాయంత్రం ఏడు గంటలకు వివాహ జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్‌తోపాటు నరసాపురానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

వంగవీటి రాధాకృష్ణ 2004లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. మరోవైపు ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.