Kailash Yatra 2025: కైలాస మానస సరోవర యాత్రలో విరిగిపడ్డ కొండ చరియలు

Kailash Yatra 2025: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్న యాత్రికులకు అడ్డంగా కొండచరియలు విరిగి పడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లాలో జరిగింది. కైలాస్ మానస సరోవర యాత్రలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడటంతో భక్తులు భయానికి గురయ్యారు. అయితే ఎవరికీ అపాయం జరుగలేదు. కాగా వందలాది మంది యాత్రికులు అదే రోడ్డులో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్డుపై పడిపోయిన వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది.
కరోనా మహమ్మారివలన కైలాస మానస సరోవర యాత్ర గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయింది. 2020లో యాత్రను నిలిపివేయగా, ఆతర్వాత భారత్ చైనాకు ఘర్షన వాతావారణం ఏర్పడటంతో అనుమతులను నిలిపివేశారు. 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చైనాల మధ్య పరిస్థితులను చక్కదిద్దారు. దీంతో రెండు దేశాల మధ్య సాధారణ పరిస్తితులు నెలకొన్నాయి.
జూన్ 2025నుంచి కైలాస్ మానస సరోవర యాత్రను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే అధికారికంగా ప్రకటించింది. 50 మంది యాత్రికులను ఒక గ్రూప్ గా చేసి 5 బృందాలు ఉత్తరాఖండ్ నుంచి యాత్రకు బయలు దేరుతాయి. అనేక మంది యాత్రికులు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం కొండ చరియలు విరిగి పడటంతో వందలాది మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. తొందరలోనే పరిస్థితులు చక్కబడతాయని అధికారులు తెలిపారు.