Home / తాజా వార్తలు
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 40వేల స్కూళ్లలో పేరెంట్- టీచర్ మీట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు బాపట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్, పేరెంట్స్తో చంద్రబాబు సమావేశమయ్యారు. బాపట్లలోని ఓ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా […]
OnePlus Community Sale: స్మార్ట్ఫోన్ కంపెనీ వన్ప్లస్ డిసెంబర్ 4, 2014న భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. పదకొండు సంవత్సరాల తర్వాత బ్రాండ్ తన 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిటీ సేల్ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుండి 17 వరకు కొనసాగుతుంది.సేల్లో సరికొత్త , టాప్ సెల్లింగ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు OnePlus.in, Amazon.in, Flipkart, Myntra, OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ […]
CM Revanth Reddy Tweet On One Year Of Congress Ruling: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సరిగ్గా పదేళ్లు పట్టింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ మేరకు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది ప్రజాపాలనలో చాలా సంతృప్తిగా […]
Allu Arjun extends financial support of Rs 25 lakhs: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప -2’. ఈ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో ఫ్యాన్ష్ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో లాఠీచార్జ్ చేయడంతో భయంతో […]
Donald Trump receives ‘Patriot of the Year’ award: అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్నకు అరుదైన అవార్డు వరించింది. మీడియా సంస్థ ఫ్యాక్స్ నేషన్ నిర్వహించిన లాంగ్ ఐలాండ్ సమావేశంలో ‘పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును డోనాల్డ్ ట్రంప్ అందుకున్నారు. వాస్తవానికి ఈ అవార్డును సైనికులు లేదా దేశానికి సేవ చేసే వారికి ఈ అవార్డును అందజేస్తారు. అయితే తొలిసారి ఈ అవార్డును ట్రంప్నకు అందజేయడం విశేషం. ప్రస్తుత […]
TGPSC Group-I Mains Exams: తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్కు లైన్ క్లియర్ అయింది. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన చేసిన పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా, 2022 గ్రూప్ -1 నోటిఫికేషన్ను పక్కన పెట్టి 2024లో రేవంత్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని కొందరు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలి ప్రిలిమ్స్ పరీక్షల్లో 14 తప్పులున్నాయని చెబుతూ, త్వరలో జరప తలపెట్టిన మెయిన్స్ను వాయిదా వేయాలని కోరారు. […]
Accident At Pochampally: తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ దగ్గర ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ వాహనం చెరువులో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి […]
Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద రైతుల ‘జఠా’ ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది. ఇవీ డిమాండ్లు.. పండించిన తమ పంటలకు కనీస మద్దతు ధర […]
Telangana Thalli Statue For The Secretariat: తెలంగాణ తల్లిరూపంపై సస్పెన్స్ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, మెడలో కంటె, నుదుటన తిలకం, ఎరుపు రంగు జాకెట్ నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు దిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న వరి సజ్జలున్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. అచ్చమైన తెలంగాణ పల్లె […]
Four National Panchayat Awards in ap: గ్రామీణాభివృద్ది విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నూతన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధిలో ఇప్పటి వరకు అనుసరించిన మూస ధోరణులకు భిన్నంగా.. ఆయా గ్రామాల అవసరాలు, ప్రాధాన్యతలు, సౌకర్యాల పరంగా వాటిని అభివృద్ధి చేయాలని జనసేనాని సూచిస్తూ, అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాలుగు విభాగాల్లో అవార్డులు […]