Home / తాజా వార్తలు
Group-1: గ్రూప్- 1 పరీక్ష వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం కమిషన్ ను పలు అంశాలపై ప్రశ్నించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మృతభాషకు ప్రాధ్యాన్యత ఇస్తుంటే.. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వారికే ఎందుకు ఇస్తున్నారని కోర్టు అడిగింది. తెలుగు పరీక్ష రాసిన వారికి మార్కులు తక్కువగా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. దీనిపై కమిషన్ తగిన కారణాలను చెప్పాలని […]
Finance department: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనే అంచనాలకు మించి పన్నులు వసూళ్లు జరిగాయి. గత ఏప్రిల్ నెలలో రూ. 2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 2.10 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇది గతేడాది ఏప్రిల్ నెలకు 12.6 శాతం మేర పెరిగినట్టు సమాచారం. అలాగే జీఎస్టీ పన్నుల వసూళ్లను […]
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కార్మికులకు […]
TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ్యంగా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే1 నుంచి జూలై 15 వరకు కొత్త నిబంధనలను […]
CSK Vs PBKS: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నై చాహల్ ధాటికి జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో సామ్ కరన్ (88) రాణించాడు. సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ సామ్ కరన్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ […]
Halltickets: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను నీట్ 2025 సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నీట్ యూజీ ఎంట్రెన్స్ టెస్ట్ ను మే4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అందుకు గాను పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నీట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు అఫిషియల్ వెబ్ సైట్ http://neet.nta.nic.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ […]
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ఇవాళ పేలుడు జరిగింది. ప్రమాదంలో 9 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మరణించగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. కాగా ప్రమాదానికి గురైన వారిని పోలీసులు గుర్తించారు. వారిలో చాడ గ్రామానికి చెందిన రాజబోయిన […]
Beer sales: తెలంగాణలో బీర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండుగలైనా, పెళ్లిళైనా, ఫంక్షన్ లు అయినా, ఏ చిన్న పార్టీ జరిగినా.. మందుబాబులు బీర్లతో జల్సా చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద సంఖ్యలో బీర్ల కేసులు ఖాళీ చేస్తున్నారు. దీంతో బీర్ సీసాలకు కొరత ఏర్పడింది. అయితే రాష్ట్రంలో బీర్లకు ఎలాంటి కొరత లేకుండా డిమాండ్ తగినట్టు ఉత్పత్తి జరగాలని ప్రభుత్వం బీవరేజెస్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలసిందే. […]
Visakhapatnam: విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. 2 వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. యాప్లో 2 వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడి ద్వారా ఈ కేసు చేధించినట్టు చెప్పారు. నరేంద్ర భార్య […]
Tollywood New Movie Passion First Look Released by Director Sekhar Kammula: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుధీస్, హీరోయిన్ అంకిత నటించిన లేటెస్ట్ మూవీ ‘పేషన్’. ఈ సినిమాకు అరవింద్ జాషువా దర్శకత్వం వహించగా.. REDANT క్రియేషన్ బ్యానర్పై నరసింహ యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మించారు. తాజాగా, ఈ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను స్టార్ డైరెక్టర్ శేకర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్బంగా […]